డాక్టర్.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా
అమనాంలోరక్త దాన శిబిరం ఏర్పాటు
వై.ఎస్.ఆర్ మూడవ వర్ధంతిని పురస్కరించుకొని అమనాంలో వై.యస్.ఆర్
సీపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ యొక్క కార్యక్రమానికి
ముఖ్య అతిధిగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పి.ఉమారాణి గారు
హాజరై రక్తదాన శిబిరంను ప్రారంభించారు.
ఈ సందర్బంగా 30మంది కార్యకర్తలు రక్తదానం చేశారు.అనంతరం సభను
ఉద్దేశించి ఉమారాణి గారు ప్రసంగిస్తూ వై.ఎస్.ఆర్ రాష్ట్రానికి చేసిన సేవలను
కొనియాడారు.అమనాం వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల కృషిని ప్రశంసించారు.
రక్తదాన కార్యక్రమం అవసర సమయంలో ప్రాణాలు కాపాడడానికి ఎంతో
ఉపయోగపడుతుంది అని రక్తదానం చేయడం చాలా మంచిదని చెప్పారు.
మరో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు గాదె రోసిరెడ్డి గారు వై.ఎస్.ఆర్
సేవలను,రక్తదానం చేసిన వారి గూర్చి కొనియాడారు.
ఈ కార్యక్రములో ఎన్నారై మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్ పాలుగొన్నారు.
ఆయన మాట్లాడుతు రక్తదాన వలన ఉపయోగాలను ప్రజలకు వివరించారు.
ఈ యొక్క కార్యక్రము వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ స్థానిక నాయకులు కార్యకర్తలు
మరియు మహిళల ఆధ్వర్యంలో జరిగింది.
అమనాంలోరక్త దాన శిబిరం కార్యక్రమ దృశ్యాలు
Thanq to all donetors
ReplyDeleteCp reddy army , hyderabad